జీ7 శిఖరాగ్ర సదస్సుకు మోదీ
NEWS Jun 15,2025 06:16 pm
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు ప్రధాని మోదీ. ఈ నెల 18 వరకూ పర్యటిస్తారు. సైప్రస్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్.సైప్రస్ పర్యటన అనంతరం కెనడాకు చేరుకుంటారు. ఈ నెల 16-17 తేదీల్లో కెనడాలో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు ప్రధాని.