కథలాపూర్ మండలంలోని ఇప్పపల్లి గ్రామంలో చెరువుని అక్రమిస్తున్నట్లు గ్రామస్తులు కొందరు ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. అక్రమంగా తమ గ్రామంలో ఉన్న చెరువు భూమిని చదును చేసి గోడ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నిసార్లు గోడను నిర్మించవద్దని తెలిపిన కానీ పట్టించుకోవడంలేదని విన్నవించారు. అధికారులు వెంటనే స్పందించి గోడను కూలగొట్టేస్తుందని తమ గ్రామం చెందిన చెరువును కాపాడాలని కోరారు.