11 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం
NEWS Jun 15,2025 02:27 pm
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 27 ఏళ్ల యువకుడు.కిరాణా దుకాణానికి వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై బలవంతంగా ఎక్కించుకొని, పొలం వద్దకు తీసుకెళ్లి రేప్ చేశాడు భూక్య హరి. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుతో రాష్ట్రంలో పోక్సో కేసుల సంఖ్య 469కి చేరింది.