మెట్ పల్లి: భూభారత్ రెవెన్యూ సదస్సు
NEWS Jun 13,2025 09:31 pm
మెట్ పల్లి పట్టణంలో భూభారత్ రెవెన్యూ సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు తమ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులు MROకి అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జట్టి లింగం, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు ఎర్రల హనుమంతు, యమ రాజయ్య, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు పుల్లూరు వెంకటేష్, బొడ్ల ఆనంద్, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.