ఇరాన్ అణు స్థావరాలపై దాడులు మొదలు పెట్టింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహ్మద్ బగేరీ మృతి చెందినట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు ఇరాన్ అధ్యక్షుడు. తగిన రీతిలో సమాధానం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. కాగా ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది అమెరికా. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు.