అమెరికా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. శుక్రవారం ముందస్తు సమాచారం లేకుండానే ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులకు దిగింది. దీంతో ఆ దేశం ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఇదిలా ఉండగా ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులతో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది యుఎస్ఏ. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో. అమెరికా బలగాలను కాపాడు కోవడమే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.