చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా మల్సూర్
NEWS Jun 13,2025 07:38 am
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ముఖ్య పౌర సంబంధాల శాఖ అధికారి (సీపీఆర్ఓ) గా సీనియర్, పదవీ విరమణ పొందిన డాక్టర్ గుర్రం మల్సూర్ ను నియమించింది ప్రభుత్వం. ఆయన వృత్తి రీత్యా పశు వైద్యాధికారిగా పని చేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ -1 పరీక్షలు రాశారు. ఆ తర్వాత కన్ ఫర్మ్ డ్ ఐఏఎస్ ఆఫీసర్ గా వివిధ విభాగాలలో పని చేశారు. ప్రధానంగా ప్రపంచ బ్యాంకు ద్వారా ప్రాజెక్టులను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు.