ప్రధాని..షా రాజీనామా చేయాలి
NEWS Jun 12,2025 05:14 pm
బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి సంచలన కామెంట్స్ చేశారు. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాద ఘటన పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు రైలు ప్రమాదం జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.