పరిశుభ్రత పనుల్ని పరిశీలించిన కమీషనర్
NEWS Jun 12,2025 02:48 pm
ఒక మార్పు - అభివృద్దికి మలుపు.. 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ నేటి నుండి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నందున స్కూల్ లోపల బయట పారిశుద్ధ్య పనులు చేపట్టడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని జూనియర్ కాలేజీలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందని, మెట్ పల్లి పట్టణంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పారిశుద్ధ్య పనులు చేపట్టమన్నారు. ఎంఈఓ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు