హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు మాజీ సీఎం కేసీఆర్. ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. అంతకు ముందు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 55 నిమిషాల పాటు ఎంక్వయిరీ సాగింది. పలు ప్రశ్నలకు తానే సమాధానం ఇచ్చారు.