తెప్పపై విహరించిన శ్రీ పద్మావతీ అమ్మవారు
NEWS Jun 11,2025 02:28 pm
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా పద్మ సరోవరంలో శ్రీ పద్మావతీ అమ్మవారు తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు స్వామి వారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.