12న కూటమి వార్షిక విజయోత్సవం
NEWS Jun 11,2025 10:28 am
ఏపీ కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్బంగా ఈనెల 12న వార్షిక విజయోత్సవ సంబురాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలలో మునిగి పోవాలని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా బరిలోకి దిగాయి. ఏకంగా 165 సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించారు.