సజ్జలకు సమన్లు జారీ చేస్తాం - శైలజ
NEWS Jun 11,2025 08:37 am
మహిళలను సజ్జల అవమానించారంటూ రాజధాని రైతులు, మహిళలు ఇచ్చిన ఫిర్యాదును NWCకి పంపినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. ఈ ఘటనపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు జారీ చేస్తామని తెలిపారు. మహిళల ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాశామన్నారు. కాగా సజ్జలపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కుడా డిమాండ్ చేశారు.