TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
NEWS Jun 10,2025 02:02 pm
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి స్థానం దక్కింది. ఆయనను టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం నిజాంసాగర్ చౌరస్తాలో సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు గడ్డం సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సెలర్లు పాత శివ కృష్ణమూర్తి పాల్గొన్నారు.