మైలవరం మండలం చంద్రాల గ్రామంలో 2017 -18 సంవత్సరంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందలేదని స్థానిక తహసిల్దార్ కార్యాలయాన్ని బాధితులు ముట్టడించారు. రోడ్డు నిర్మాణం జరిగి 8 సంవత్సరాలు గడుస్తున్నా న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.