రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో బాల భరోసా పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపింది. ఈ పథకం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉంటాయని ప్రకటించారు మంత్రి దాసరి సీతక్క. అవసరమైతే ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తామని పేర్కొన్నారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.