టీపీసీసీ కార్యవర్గం ప్రకటించిన హైకమాండ్
NEWS Jun 10,2025 07:50 am
ఏఐసీసీ హైకమాండ్ టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవులలో సామాజిక న్యాయానికి, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీ లకు 8, ఎస్సీలకు 5, ఎస్టీ లకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. 67 శాతం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీ లకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు.