హత్య కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ
NEWS Jun 09,2025 04:08 pm
కొండగట్టులో జరిగిన హత్య కేసు వివరాలను సోమవారం డీఎస్పీ రఘుచందర్ మల్యాల ఠాణాలో వెల్లడించారు. మృతుడు ఉప్పు రమణారెడ్డి తన ఉనికి కోసం నిందితులను గత నాలుగు సంవత్సరాలుగా మద్యానికి డబ్బులు, తనకు గౌరవం ఇవ్వాలని వారిని కొట్టేవాడని, దీంతో జూన్ 2న జరిగిన గొడవలో ఆ యువకులు రమణారెడ్డిని హత్య చేసి గుట్ట ప్రాంతలో పూడ్చిపెట్టారన్నారు. రమణారెడ్డిపై 27 కేసులతో పాటు గతంలో పీడీ యాక్ట్ కూడా వుందన్నారు. నిందితుల్లో ఆరుగురు మేజర్లు, ఇద్దరు మైనర్లు వున్నారని తెలిపారు.