ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో తనకు చోటు కల్పించక పోవడం పట్ల ఆయన ఒకింత నిరాశకు గురయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఎల్లప్పుడూ పార్టీ అధిష్టానం వైపే ఉంటానని ప్రకటించారు. హైకమాండ్ అన్ని జిల్లాలకు సమ న్యాయం కల్పించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి ప్రాంతంలో ఒక్క మంత్రి కూడా లేకపోతే ప్రజలకు ఏం జవాబు చెప్పాలనే బాధే తప్ప మరేం లేదన్నారు.