మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
NEWS Jun 08,2025 08:32 am
జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. తీవ్ర సంతాపం ప్రకటించారు. తన మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగాడని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నాయకుడిగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు.