ఇసుక అక్రమ రవాణాపై మౌనమేల..?
NEWS Jun 08,2025 07:57 am
మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ వర్మ నిప్పులు చెరిగారు. పిఠాపురంలో ఇసుక అక్రమ రవాణాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటే పోలీసులు నాలుగు రోజులు స్టేషన్ లో ఉంచుతున్నారని ఆరోపించారు.. అదే అక్రమంగా ఇసుక తరలిస్తుంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.ఇప్పటికే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ హెచ్చరించారని అన్నారు. రోజుకి 200 లారీలు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ధ్వజమెత్తారు.