ఎన్డీఎస్ఏ రిపోర్టు బక్వాస్ - కేటీఆర్
NEWS Jun 08,2025 06:06 am
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో కొత్తగా కోటి ఎకరాల మాగాణం సృష్టించ బడటానికి ప్రధాన కారణం హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పనిచేసి మిషన్ కాకతీయ, కాళేశ్వరాన్ని శరవేగంగా పూర్తి చేశారన్నారు. గుజరాత్లో ఒక పెద్ద బ్రిడ్జి కూలి పోయి 140 మంది చనిపోతే ఏ NDSA వెళ్ల లేదన్నారు. బీహార్లో నాలుగు రోజులకి ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాధుడు లేడంటూ ధ్వజమెత్తారు. అదే తెలంగాణలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టం జరిగితే ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు.