హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ను పరామర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. గోపినాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 48 గంటలు అయితే కానీ తన హెల్త్ కండీషన్ గురించి చెప్పలేమంటూ పేర్కొన్నారు వైద్యులు. నిన్న హరీశ్ రావుతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు.