కాళేశ్వరం అవకతవకలపై ఈటల నిజం చెప్పాలి
NEWS Jun 07,2025 09:43 am
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవతవకలపై ఎంపీ ఈటల రాజేందర్ నిజం చెప్పాలన్నారు. కాళేశ్వరంతో తమకు సంబంధం లేదని, కేసీఆరే తన సొంత తెలివి తేటలు, ఇంజనీరింగ్ తో నిర్మించిన ప్రాజెక్ట్ అని చెప్పడంలో తప్పేముందన్నారు. కేసీఆర్ పాలన వల్ల పలు శాఖల అధికారులు జైళ్లకు వెళ్తున్న పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించకుండా ఈటల వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.