వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి నెలకొందని పేర్కొంది. దీని కారణంగా మూడు రోజుల పాటు వర్షాలు వస్తాయని తెలిపింది. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం అందని స్పష్టం చేసింది.