కేసీఆర్ దేవుడా..కమిషన్ ముందుకు రావాల్సిందే
NEWS Jun 07,2025 08:51 am
సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పీఎంగా పని చేసిన పీవీ నరసింహారావే కోర్టు నోటీసులు ఇస్తే మెజిస్ట్రేట్ ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడని అన్నారు. కేసీఆర్ ఏమైనా దేవుడా? ఆయన కూడా మనిషే కదా అన్నారు. ఒక్క నోటీసు ఇస్తేనే ఆగమాగం అవుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. నెలల కొద్దీ జైల్లో ఉన్న మా పరిస్థితి ఏంటి మరి అని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని అడగడం కాదు ముందు కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇవ్వాలన్నారు.