టాస్క్ కార్యక్రమాలపై మంత్రి సమీక్ష
NEWS Jun 07,2025 08:39 am
రాష్ట్రంలో జరుగుతున్న టాస్క్ కార్యక్రమాలపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష చేపట్టారు. ఏడాదిలో టాస్క్ ద్వారా 4,100 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది టాస్క్ ద్వారా కనీసం 6 వేల మందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. నైపుణ్య శిక్షణ అందించడంలో టాస్క్ గణనీయ పురోగతి సాధించనున్నట్టు తెలిపారు.