నిర్మలా సీతారామన్ తో మంత్రి సవిత భేటీ
NEWS Jun 07,2025 08:35 am
గోరంట్ల మండలం పాలసముద్రంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ స్, నార్కోటిక్స్(NACIN) ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మర్యాద పూర్వకంగా కలిశారు. పెనుకొండ నియోజక వర్గంలోని పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ పార్థసారథి కూడా పాల్గొన్నారు.