ప్రధాని నరేంద్ర మోదీకి జి-7 సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ మేరకు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ పీఎంకు స్వయంగా ఫోన్ చేశారు. జూన్ 15 నుంచి 17 వరకు కెనడా వేదికగా జీ-7 సమ్మిట్ జరగనుంది. ఇదిలా ఉండగా కెనడా ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్నీకి అభినందనలు తెలిపారు మోడీ.