చందమామ కథలు వినిపించారు - భట్టి
NEWS Jun 06,2025 08:45 pm
ఎన్నికల ముందు హడావుడిగా నార్లాపూర్ వద్ద పంపు స్విచ్ ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసి అద్భుతం చేశారంటూ ఎద్దేవా చేశారు డిప్యూటీ సీఎం భట్టి. పాలమూరు బంగారం అయ్యిందని అరచేతిలో వైకుంఠం చూపారంటూ మండిపడ్డారు. బొంబాయి, బొగ్గు బాయి, దుబాయి అని పాటలు చెప్పిన వాళ్ళు అభివృద్ధిని పక్కనపెట్టి వెళ్లిపోయారని ఆరోపించారు. దేవరకద్ర నియోజకవర్గ బహిరంగ సభలో భట్టి బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై సెటైర్లు వేశారు.