ఆలయ నిర్మాణానికి విరాళం
NEWS Jun 06,2025 08:38 pm
కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని శ్రీ మత్తడి పోచమ్మ ఆలయ నిర్మాణానికి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర జాగృతియూత్ కన్వీనర్ ఎ సంపత్ గౌడ్ రూ. 2,11, 000 విరాళాన్ని ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగాఆలయ కమిటీ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ధూర్శెట్టి అశోక్, కోశాధికారి గుజ్జరి మారుతి, గౌరవ అధ్యక్షులు శంకర్ గౌడ్, ఆలయ కార్యవర్గ సభ్యులు రాజారాం , బాలయ్య, పోకల సాయిరాం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.