టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు తమ పనితీరు సరి చూసుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తల సమన్వయ బాధ్యత మనపైనే ఉందన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని పేర్కొన్నారు. ఆ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలని హితవు పలికారు టీపీసీసీ చీఫ్.