తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజు స్వామి వారు రాత్రి సర్వ భూపాల వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్పూర హారతులు సమర్పించి కొలిచారు. సర్వ భూపాల వాహనంపై ఊరేగే స్వామి వారిని దర్శించుకుంటే యశో ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. టీటీడీ ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.