కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ లో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. హ్యామ్ విధానంలో రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఇందులో భాగంగా దాదాపు 13 వేల కి.మీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రెండున్నర ఏళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రజలపై భారం పడకుండా 15 సంవత్సరాలు మెయింటెన్ చేసేలా నిర్మాణ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నారు.