ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ తీపికబురు
NEWS Jun 06,2025 07:33 am
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. తెలంగాణ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని, సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాలకు ప్రమాద బీమా పథకం అమలుకు రూ. 38.5 కోట్లు స్త్రీ నిధికి కేటాయించింది. రాష్ట్రంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.మొత్తం 13,137 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది.