తొక్కిసలాట ఘటన..RCBపై కేసు నమోదు
NEWS Jun 05,2025 10:01 pm
బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. విక్టరీ పరేడ్ వాయిదా వేసుకోవాలని కోరినా కర్ణాటక ప్రభుత్వం, అసోసియేషన్ పట్టించు కోలేదని ఆరోపించారు పోలీసులు. ఈ మేరకు నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతికి కారణమయ్యారంటూ RCB, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్పై కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది సర్కార్.