కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏపీలోని విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు ఓకే చెప్పింది. ఇందులో భాగంగా రైల్వే జోన్ కు కొత్తగా జనరల్ మేనేజర్ ను నియమించింది. ఈ మేరకు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తొలి జీఎంగా సందీప్ మాథుర్ ను నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధ్రువీకరించారు.