ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్బంగా చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర హైకోర్టు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది. సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాట జరుగుతుంటే స్టేడియంలో సెలబ్రేషన్స్ ఎలా నిర్వహిస్తారాంటూ ప్రశ్నించింది.