కొండగట్టులో అధికారుల తనిఖీలు
NEWS Jun 05,2025 10:03 pm
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సిఐ ప్రశాంత్ రావు ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదాల తయారీ కేంద్రాన్ని, పలు దుకాణాలకు సంబంధించిన టెండర్ నిర్వహణ ప్రక్రియను, 2023-24 నుంచి 2025-26 వరకు గల ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తమ తనిఖీలు మరో మూడు, నాలుగు రోజులపాటు కొనసాగుతాయని విజిలెన్స్ అధికారులు తెలిపారు.