ఒక్క సినిమా పోస్టర్ ప్రమాదాలకు కారణం కావడం విస్తు పోయేలా చేసింది. హైదరాబాద్ లోని పంజాగుట్టలో క్రిష్ దర్శకత్వం వహించిన వేదం పోస్టర్ ను ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్ ను చూస్తూ 40కి పైగా యాక్సిడెంట్స్ జరిగినట్లు స్వయంగా దర్శకుడు వెల్లడించాడు. పోలీసుల నుంచి ఫిర్యాదు అందడంతో దానిని తొలగించినట్లు తెలిపారు. వేదం సినిమా విడుదలై 15 ఏళ్లు గడిచిన సందర్భంగా అప్పటి విషయాలను పంచుకున్నారు.