ఆర్ఎంఓ డాక్టర్ పద్మజపై వేటు
NEWS Jun 05,2025 08:02 am
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనపై సీరియస్ గా తీసుకుంది. ఆస్పత్రిలో రోగులకు కలుషితాహారం సరఫరాపై మండిపడింది. ఇందుకు కారణమైన , నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్ఎంవో డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది. శానిటేషన్ కాంట్రాక్ట్ రద్దుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.