నెల్లూరు జిల్లాలో గురవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్ లో నలుగురు మృతి చెందారు. ఆత్మకూరు మండలం ఏఎస్ పేట అడ్డరోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. చని పోయిన వారు వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు వెళ్తున్న పొగాకు కూలీలు గా గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల సంతాపం వ్యక్తం చేశారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.