కర్ణాటక సీఎం సిద్దరామయ్య కీలక ప్రకటన చేశారు. బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 33 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున జనం వస్తారని తాము ఊహించ లేదన్నారు. స్టేడియం కెపాసిటీ 35 వేలు ఉంటే 3 లక్షల మంది వచ్చారని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు.