తత్కాల్ రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో ఈ ఆధార్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర రైల్వే శాఖ. దీని వల్ల రైల్వే ప్రయాణికుడిని గుర్తించేందుకు ఉపయోగ పడుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన వెలువరించింది. త్వరలో ఇది అమల్లోకి రానుందని స్పష్టం చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.