బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. కర్ణాటక సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది సర్కార్.