11 మంది చనిపోతే రాద్దాంతం చేస్తారా..?
NEWS Jun 05,2025 07:07 am
కర్ణాటక సీఎం సిద్దరామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. బెంగళూరు వేదికగా జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుక విషాదాన్ని నింపింది. భద్రతా వైఫల్యం కారణంగా 11 మంది చని పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన , బాధ్యత కలిగిన సీఎం సిద్దరామయ్య అత్యంత బాధ్యతా రాహిత్యంతో మాట్లాడారు. పదకొండు మంది చని పోతే రాద్దాంతం చేస్తారా అని ప్రశ్నించారు. కుంభ మేళా లో 60 మంది చని పోతే ఎవరూ ప్రశ్నించ లేదంటూ నిలదీశారు. ఈ ఘటనను ఆయన లైట్ గా తీసుకోవడం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.