11కు చేరిన మృతుల సంఖ్య
NEWS Jun 05,2025 06:30 am
ఆర్సీబీ విజయయాత్ర సందర్బంగా బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర సంతాపం తెలిపారు క్రికెటర్ విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే. ఏర్పాట్లలో వైఫల్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని బీసీసీఐ ఆరోపించింది. మరో వైపు సీఎం, డిప్యూటీసీఎం, హోం మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.