సనాతన ధర్మం అంటూ నిత్యం మాట్లాడే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు విడాకులు ఇచ్చాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ. సనాతన ధర్మాన్ని సమర్థించే వారితో పాటు పవన్ ను తక్షణమే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తనకో న్యాయం ఇతరులకో న్యాయం అన్నది మంచిది కాదన్నారు. పాలకులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.