జూలై 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు
NEWS Jun 04,2025 02:01 pm
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు చేసింది కేంద్ర సర్కార్. జులై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. భారత్ , పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరగనుందని సమాచారం.