ఆర్సీబీకి సీఎం, డిప్యూటీ సీఎం కంగ్రాట్స్
NEWS Jun 04,2025 12:17 pm
18 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా నిలిచింది ఆర్సీబీ. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే ఆనందం పట్టలేక ఎగిరి గంతేశాడు. బన్నీ అయితే కోహ్లీ ఆట తీరును మెచ్చుకున్నాడు. ఈ సందర్బంగా చారిత్రక విజయం సాధించినందుకు బెంగళూరు జట్టును ప్రత్యేకంగా అభినందలతో ముంచెత్తారు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఇవాళ మధ్యాహ్నం నుంచి టీం బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించనుంది.